న్యూయార్క్: అమెరికా సైన్యానికి చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్(Apache helicopter) .. హోర్ముజ్ జలసంధి వద్ద కూలింది. ఆ హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరో వైపు ఇరాన్తో వార్లో వ్యూహాత్మకంగా మారిన హోర్ముజ్ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మంగళవారం ఆ హెలికాప్టర్ కూలింది. కానీ దేని వల్ల ఆ ఘటన జరిగిందో ఇంకా తెలియదు. రెండు రోజుల క్రితం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి దాడులు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఎన్బీఏ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించిన ట్రంప్.. న్యూయార్క్ ఎయిర్పోర్టు వద్ద జర్నలిస్టులతో మాట్లాడుతూ పైలట్లు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఆ ఘటనపై ఇవాళ పూర్తి వివరాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏదేమైనా పైలట్లు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. అపాచీ హెలికాప్టర్ కూలిన ఘటనపై అమెరికా మిలిటరీకి చెందిన సెంట్రల్ కమాండ్ కానీ, రక్షణ శాఖ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.