UNSC | ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సౌత్-ఈస్ట్ ది లెవాంట్ (ISIL)ను ఆగ్నేయ ఆసియాలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. జాబితాలో చేర్చిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థ ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు ఆ సంస్థకు చెందిన వ్యక్తులపై ప్రయాణ నిషేధంతో పాటు పలు ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ ఉగ్రసంస్థ 2016లో ఏర్పాటైనట్లు ఐక్యరాజ్య సమితి వెబ్సెట్ తెలిపింది.
ఇరాక్, లెవాంట్లోని ఇస్లామిక్ స్టేట్తో ముడిపడి ఉందని, దీని నాయకుడు అబూ సయ్యాఫ్. 2017లో అతను హత్యకు గురయ్యాడు. ఇంతకు ముందు జనవరి 16న భద్రతా మండలి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు బావ. అతను లష్కరే తోయిబా అంటే జమాత్-ఉత్-దవా రాజకీయ విభాగం కమాండర్. లష్కరే తోయిబా అంతర్జాతీయ వ్యవహారాల అధిపతి కూడా. భారత్లోని మ్మూ, కాశ్మీర్తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు పాల్పడింది.