ఆమ్స్టర్డామ్: ఇరవై కుటుంబాలకు అవసరమైన ఆహార పదార్థాలను ఒకేచోట నిల్వచేయగల పెద్ద ఫ్రిజ్ను నెదర్లాండ్స్కు చెందిన ఓ సంస్థ తయారుచేసింది. ఇందులో వింతేముంది? పెద్ద, పెద్ద హోటళ్లలో చూసిందే కదా! అంటారా.. ఆగండాగండీ. ఆ ఫ్రిజ్ నడవడానికి విద్యుత్తు అవసరం లేదు. అదే ‘అండర్ గ్రౌండ్ ఫ్రిజ్’. భూమిలోపల నిర్మించే ఈ ఫ్రిజ్ను ‘గ్రౌండ్ఫ్రిజ్’ అనే సంస్థ తయారు చేసింది. బ్యాటరీ వెంటిలేటర్ సాయంతో నడిచే ఈ ఫ్రిజ్లో ఏడాదంతా 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేలా సెట్ చేశారు. మూడు వేల లీటర్ల కెపాసిటీ గల ఈ ఫ్రిజ్ ధర రూ. 14.89 లక్షలు.