రఫా(గాజా స్ట్రిప్): మూడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణ మృదంగం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితి గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం గాజాలో 5 లక్షలకుపైగా ప్రజలు ఆకలితో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే కాల్పుల విరమణ అమలు చేయాలని ఐరాస భద్రతా మండలి ఇజ్రాయెల్కు సూచించింది. అయితే అంతర్జాతీయ ఒత్తిడిని లెక్క చేయని ఇజ్రాయెల్, హమాస్ను అంతమొందించే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పింది. ఇప్పటివరకు 53,320 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు.