అమెరికా అధ్యక్షుడు జోబైడెన్పై ఉక్రెయిన్ ఎంపీ ఇన్నా సోవ్సన్ తీవ్రంగా మండిపడ్డారు. రష్యా ప్రతిరోజూ బాంబులతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నా… బైడెన్ చేసిందేమీ లేదని, కనీస సహాయం కూడా చేయలేదని ఆమె ఆక్షేపించారు. ఉక్రెయిన్ ప్రజలకు భరోసా, ఉపశమనం కల్పించే ఒక్క మాట కూడా బైడెన్ నోట రాలేదని ఆమె మండిపడ్డారు. నేను చాలా ముక్కుసూటిగానే మాట్లాడతా. మాకు భరోసా కల్పించే మాటలు బైడెన్ నోట రాలేదు. ఇప్పుడు చేస్తున్న సాయం కంటే పశ్చిమ దేశాలు మరింత సాయం చేయాలి. పోలాండ్కు భరోసా ఇచ్చారు సంతోష|మే. అయితే కీవ్, కార్ఖీవ్లో బాంబుల మోత ఉంది. వార్సాలో కాదు కదా అంటూ ఇన్నా సోవ్సన్ ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.
ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో పాటు ఉక్రెయిన్ రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులను వేర్వేరుగా కలిశారు. ఉక్రెయిన్కు ఆయుధ సామగ్రి చేరవేత, ఇతర భద్రతా హామీలపై ఆండ్రెజ్తో చర్చించారని వైట్హౌస్ తెలిపింది. వార్సాలో ఉక్రెయిన్ శరణార్థులతో బైడెన్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఒక ‘కసాయి’గా అభివర్ణించారు.