ఉక్రెయిన్కు చెందిన సైనిక యుద్ధ విమానం కీవ్ సమీపంలో కుప్పకూలినట్లు సమాచారం. అయితే ఇందులో 14 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఎందరు ప్రాణాలను కోల్పోయారు, ఎందరు బతికారన్న విషయాలు మాత్రం తెలియాల్సి వుంది. ఏ కారణాల వల్ల ఈ విమానం కుప్పకూలిందన్నది ఇప్పటి వరకు తెలియడం లేదు. ఉక్రెయిన్ ప్రభుత్వం విమానం కుప్పకూలిందన్న విషయాన్ని అంగీకరించింది. రష్యా సైనికులే ఈ ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేశారని ఓ రిపోర్టు కూడా వచ్చింది. ఐదుగురు మరణించారని కూడా ఆ రిపోర్టులో ఉంది.
రష్యా ఒక్కసారిగా ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది. దీంతో ఇరు దేశాల సైన్యానికీ భారీ నష్టమే వాటిల్లిందని కొందరు పేర్కొంటున్నారు. మరోవైపు రష్యా దాడిలో 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి చెందారని ఉక్రెయిన్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. రష్యా చేపట్టిన ఈ ఆపరేషన్లో చాలా మంది గాయపడ్డారని ఉక్రెయిన్ పేర్కొంది.