న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్లో ఆడకుండా రష్యా అథ్లెట్లపై నిషేధం విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు. పారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నందున రష్యా అథ్లెట్లను దేశంలోకి అనుమతించవద్దని కోరుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు జెలెన్స్కీ లేఖ రాశారు.
ఒలింపిక్ గేమ్స్లో రష్యా, బెలారస్ అథ్లెట్లు న్యూట్రల్స్గా పోటీపడవచ్చంటూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడికి రాసిన లేఖలో జెలెన్స్కీ పేర్కొన్నాడు. అంతేగాక, రష్యా అథ్లెట్లను పారిస్ ఒలింపిక్ గేమ్స్ నుంచి నిషేధించకపోతే తాము ఒలింపిక్స్ను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.