కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఓ అభ్యర్థన చేసింది. కాల్పుల విరమణ పాటించాలని రష్యాను ఆ దేశం కోరింది. ఉక్రెయిన్-బెలారస్ బోర్డర్లో జరిగే చర్చలకు రెండు దేశాల ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. ఈ చర్చల్లో ప్రధాన ఎజెండా సీజ్ఫైర్ అని ఉక్రెయిన్ అధికారులు తేల్చారు. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని కూడా ఆ దేశం కోరింది. లాజిస్టిక్స్, భద్రతా అంశాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య గతంలో చర్చలు విఫలం అయ్యాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యోఉడు జెలెన్స్కీ జాతిని ఉద్దేశించింది ప్రసంగించారు. ఈ చర్చల ద్వారా ప్రతిష్ఠంభన తొలుగుతుందని భావించడంలేదన్నారు. కానీ ప్రయత్నాల్ని మాత్రం ఆపేదిలేదన్నారు. చిన్న అవకాశమైనా దాన్ని వాడాలన్నారు. ఎందుకంటే ఆ తర్వాత యుద్ధాన్ని నివారించడంలో ఉక్రెయిన్ విఫలమైందన్న ఆపవాదు రావొద్దన్నారు. రష్యా సైనికులకు జెలెన్స్కీ ఓ అభ్యర్థన చేశారు. ప్రాణాలను కాపాడుకుని, వెళ్లపోవాలంటూ తన ప్రసంగంలో తెలిపారు. ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా ఇవాళ అయిదో రోజు కాస్త సంయమనం పాటించింది.