ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్న వేళ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హఠాత్తుగా ఉక్రెయిన్లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ భేటీ అయ్యారు. దీంతో ప్రపంచ రాజకీయాల్లో ఓ సంచలనం రేగింది. బ్రిటన్ ప్రధాని కీవ్లో పర్యటిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతినిధి ఆండ్రియ్ సిబియా ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరూ భేటీ అయిన ఫొటోను ఆండ్రియ్ సిబియా పోస్ట్ చేశారు. ఉక్రెయిన్కు రక్షణ కల్పించడంలో యూకే అగ్రభాగంలో వుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు సానుభూతిని ప్రకటించడానికే జాన్సన్ ఉక్రెయిన్లో పర్యటించారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
కీవ్ నుంచి వెనక్కు వెళ్లిన రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్లో మానవ విధ్వంసానికి దిగాయి. వేలాది మంది ఉన్న క్రమటార్క్స్ పట్టణ రైల్వే స్టేషన్పై రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో 50 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మృతదేహాలు, క్షతగాత్రులు, ప్రజల హాహాకారాలతో రైల్వే స్టేషన్ అంతటా భీతావహ వాతావరణం నెలకొన్నది. రష్యా దాడులకు భయపడి దేశం నుంచి వెళ్లిపోయే వారిని తరలించడానికి ఈ రైల్వే స్టేషన్ను ఉపయోగిస్తున్నారు.
Surprise 😉 pic.twitter.com/AWa5RjYosD
— Embassy of Ukraine to the UK (@UkrEmbLondon) April 9, 2022