లండన్: బ్రిటన్కు చెందిన ఒక హాస్పిటల్, పలువురు రోగులను భయాందోళనకు గురి చేసింది. ‘మెర్రీ క్రిస్మస్’ విషెష్కు బదులుగా తీవ్రస్థాయిలో క్యాన్సర్ ఉన్నట్లు కొందరు రోగులకు మెసేజ్ పంపింది. దీంతో ఇది చూసి వారంతా హడలిపోయారు. క్రిస్మస్ ఈవ్ రోజున యార్క్షైర్లోని అస్కర్న్ మెడికల్ ప్రాక్టీస్ నుంచి పలువురు రోగుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. వారికి తీవ్ర స్థాయిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లుగా ‘డీఎస్1500’ అంటూ అందులో ఉంది. ఈ మెసేజ్ చూసి కొందరు రోగులు భయాందోళన చెందారు. మరి కొందరు బాధతో ఏడ్చేశారు. కొందరు తమ బాధను ఫేస్బుక్లో వెళ్లగక్కారు.
కాగా, జరిగిన పొరపాటును ఆ హాస్పిటల్ గుర్తించింది. ఆ వెంటనే క్షమాపణలు చెబుతూ మరో మెసేజ్ పంపింది. ‘దయచేసి గతంలో పంపిన సందేశానికి హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాం. పొరపాటున దీనిని పంపాం. మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అత్యవసర పరిస్థితుల్లో దయచేసి ఎన్హెచ్ఎస్ 111 నంబర్ను సంప్రదించండి’ అని అందులో పేర్కొంది.