లండన్ : బ్రిటన్ హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రీతి పటేల్ సోమవారం ప్రకటించారు. దేశ ప్రధానిగా లిజ్ ట్రస్ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీనామా చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించనుండగా.. ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ బ్రిటన్ రాణి ఎలిబిబెత్కు రాజీనామా లేఖను అందజేయనున్నారు. కన్వన్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ ట్రస్కు ప్రీతి పటేల్ శుభాకాంక్షలు తెలుపడంతో పాటు మద్దతును అందించనున్నట్లు పేర్కొన్నారు.
బ్రిటన్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు మంత్రులు రాజీనామా చేశారు. ఇందులో భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ సైతం ఉన్నారు. ఆమె బోరిస్ జాన్సన్కు మద్దతుదారుగా భావిస్తున్నారు. చివరకు జూలైలో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు బోరస్ జాన్సన్ ప్రకటించారు. ఈ క్రమంలో కన్జర్వేటివ్ పార్టీకి ఎన్నికలు జరగ్గా.. రిషి సునాక్పై లిజ్ ట్రస్ గెలుపొందారు.
ప్రీతి పటేల్ బ్రిటన్ ప్రధాని మంత్రివర్గంలో ఉన్న భారత సంతతి మహిళ. ప్రస్తుతం ఆమె బ్రిటన్ హోంమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పదవి బ్రిటన్లో మూడో ముఖ్యమైన పదవి. ప్రీతి పటేల్ చిన్న వయసులోనే కన్జర్వేటివ్ పార్టీలో సభ్యురాలైంది. 2010లో ప్రీతి వితం నుంచి ఎంపీగా గెలుపొందారు. డేవిడ్ కామెరూన్ ప్రభుత్వంలో ప్రీతిస్థాయి పెరిగింది. 2014లో ప్రీతి ట్రెజరీ మంత్రిగా పని చేశారు. 2015లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందగా.. ఉపాధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. తర్వాత థెరిసా మే ప్రభుత్వంలో ఆమె అంతర్జాతీయ అభివృద్ధి శాఖలో రాష్ట్రమంత్రి పదవి వరించగా.. 2017లో ఇజ్రాయెల్ వివాదం కారణంగా ఆమె పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.