మనీలా: కల్మెగి తుపాన్ ధాటికి ఫిలిప్సీన్స్ అతలాకుతలమైంది. తుపాను తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల కారణాంగా 140 మంది చనిపోయారు. 217 మంది గల్లంతు కాగా, 82 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
మీడియా కథనాల ప్రకారం తుపాను కారణంగా సుమారు 20 లక్షల మంది ప్రభావితమయ్యారు. 5.6 లక్షల మంది గ్రామస్థులు నిరాశ్రయులయ్యారు.