Today History: కరోనా వైరస్ నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు 14 రోజుల క్వారంటైన్ ఉండాలని సూచించింది. ఈ 14 రోజులకే అమ్మో! అంటూ ముక్కులో నుంచి పొగలు కమ్మినారు చాలా మంది. అయితే, తన కారణంగా టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుందని ఓ మహిళను ఏకంగా 3 ఏండ్ల పాటు క్వారంటైన్లో ఉంచారు. చివరకు 1910లో సరిగ్గా ఇదే రోజున ఆవిడను క్వారంటైన్ నుంచి విడుదల చేశారు. మేరీ కారణంగా 50 మందికిపైగా టైఫాయిడ్ బారిన పడగా.. ముగ్గురు చనిపోయారు. మేరీ కేసు ప్రపంచంలోనే టైఫాయిడ్ వ్యాధి తొలి కేసు.
ఐర్లాండ్లో 1869 లో జన్మించిన మేరీ మలోన్ అనే మహిళకు 15 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చింది. అమెరికాలో వంట మనిషిగా, పని మనిషిగా పనిచేశారు. 1900 నుంచి 1907 వరకు మేరీ పనిచేసిన 7 న్యూయార్క్ కుటుంబాలలో టైఫాయిడ్ అనే వ్యాధి వ్యాపించింది.
అమెరికాకు చెందిన డిటెక్టివ్ జార్జ్ సోపర్.. టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తికి మూలాన్ని గుర్తించాడు. దీనికి సంబంధించిన విషయాలను 1907 జూన్ 15 న ప్రచురించాడు. మేరీని టైఫాయిడ్ క్యారియర్గా సోపర్ అనుమానించాడు.
సోపర్ అనుమానించిన తర్వాత మేరీని న్యూయార్క్ ఆరోగ్య శాఖ అరెస్టు చేసింది. ఆమె శాంపిల్స్ను పరిశీలించగా.. ఆమె గాల్ బ్లాడర్లో టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. 1907 మార్చి 19 న మేరీని న్యూయార్క్లోని నార్త్ బ్రదర్ ఐల్యాండ్లో ప్రభుత్వం నిర్బంధించింది. ఆమె నుంచి వారానికి మూడు సార్లు శాంపిల్స్ తీసుకుని పరిశీలంచగా.. ఆశ్చర్యకరంగా, మేరీకి టైఫాయిడ్ లక్షణాలు కనిపించలేదు. తనకు తెలియకుండానే టైఫాయిడ్ క్యారియర్గా మారడంతో ఆమెను టైఫాయిడ్ మేరీ అని కూడా పిలిచేవారు. టైఫాయిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు ఆమెను
దాదాపు 3 సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచి చివరకు విడుదల చేశారు. దాంతో 1915లో న్యూయార్క్లోని ఒక మహిళా దవాఖానలో పనిచేయడం ప్రారంభించింది. అక్కడ కూడా 25 మంది రోగులకు టైఫాయిడ్ సోకింది. దాంతో ప్రభుత్వం మేరీని మళ్లీ 1915 మార్చి 27 న నార్త్ బ్రదర్ ఐస్ల్యాండ్లోని దవాఖానలో నిర్బంధించింది. చనిపోవడానికి ఆరేండ్ల ముందు పక్షవాతానికి గురైంది. 1938 నవంబర్ 11న న్యుమోనియాతో క్వారంటైన్ సెంటర్లోనే ఆమె తుదిశ్వాస విడిచింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..