న్యూఢిల్లీ: న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్స్ ప్రాంతంలో ఇద్దరు సిక్కులపై దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటనను న్యూయార్క్లోని ఇండియన్ కౌన్సులేట్ జనరల్ ఖండించారు. ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారని, వారితో టచ్లో ఉన్నామని భారతీయ దౌత్య కార్యాలయం తెలిపింది. ఈ కేసుతో లింకు ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారని కౌన్సులేట్ పేర్కొన్నది. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు రాడ్తో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి చేసిన తర్వాత తలపాగాను కూడా లాగేసినట్లు చెబుతున్నారు. అయితే 10 రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో ఓ సిక్కుపై కూడా దాడి జరిగింది. ఈ దాడిని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటా జేమ్స్ ఖండించారు. సిక్కు వర్గంపై మరో విద్వేష దాడి జరిగిందని, ఇద్దరికి న్యాయం జరగాలని, ఈ దాడికి సంబంధించిన సమాచారం ఉన్నవారు తమతో పంచుకోవాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ కోరారు. ఇటీవల కాలంలో సిక్కులపై సుమారు 200 శాతం దాడులు పెరిగినట్లు న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ వుమన్ జెన్నిఫర్ రాజ్కుమార్ తెలిపారు. సిక్కులపై దాడుల ఘటనను విద్వేష నేరాలుగా భావించి, ఆ కోణంలో విచారణ చేపట్టాలని పోలీసుల్ని కోరినట్లు రాజ్కుమార్ తెలిపారు.
2nd attack on 2 Sikhs within 10 days exactly at same location in Richmond Hill
Apparently, targeted hate attacks against Sikhs happening in continuation. We condemn this in strong words. These shd be investigated & perpetrators must be held accountable @IndiainNewYork @USAndIndia pic.twitter.com/Ld0RIxIeNn— Manjinder Singh Sirsa (@mssirsa) April 12, 2022