న్యూఢిల్లీ: ఇండియాలో ఇవాళ ఉదయం ట్విట్టర్ పనిచేయలేదు. ఆ మైక్రోబ్లాగింగ్ సైట్లో సమస్యలు ఉన్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ ఫస్ట్ పేజీ లోడ్ అయిన సమయంలో.. మళ్లీ ట్రై చేయాలంటూ వార్నింగ్ పాప్అప్ వస్తున్నట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ఉదయం ఏడు గంటల సమయంలోనూ ట్విట్టర్ పూర్తిగా బ్లాక్ అయినట్లు తెలుస్తోంది.
ఇటీవలే ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థలో ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్లను కూడా తొలగించారు. భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా ఇవాళ్టి నుంచి మొదలుపెట్టారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని మస్క్ చూస్తున్నట్లు తెలుస్తోంది.