న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 : తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్పై దాడులు చేస్తామంటూ అధ్యక్షుడు ఎర్డోగాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కండ్లు ద్వేషంతో మూసుకుపోయాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించకపోయి ఉంటే, ఇజ్రాయెల్కు తగిన విధంగా సమాధానం చెప్పేవాళ్లం’ అని ఆయన అన్నారు.
తాము ఎలాగైతే లిబియా, కరాబాఖ్లలోకి ప్రవేశించామో, అలాగే ఇజ్రాయెల్లోకి కూడా అడుగుపెట్టగలమని ఎర్డోగాన్ హెచ్చరించారు. కొద్ది రోజులుగా ఇరు దేశాల నాయకులు తీవ్ర ఆరోపణలతో పరస్పరం మాటల దాడికి దిగుతున్నారు. ఎర్డోగాన్ ప్రభుత్వం కుర్దులపై ఊచకోతకు పాల్పడుతున్నదని నెతన్యాహు ఆరోపించగా, తుర్కియే విదేశాంగ మంత్రి స్పందిస్తూ, నెతన్యాహును ‘నయా హిట్లర్’గా అభివర్ణించారు.