జెరూసలెం : హమాస్ (Hamas )తమ భూమిని కాపాడుకునేందుకు పోరాడుతున్న విమోచన సంస్ధని, అది ఉగ్రవాద సంస్ధ కాదని టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగాన్ అన్నారు. పార్లమెంట్ భవనంలో తమ పార్టీ చట్టసభ సభ్యులను ఉద్దేశించి ఎర్డోగాన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్, హమాస్ తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేలా ముస్లిం దేశాలు కలిసిరావాలని పిలుపు ఇచ్చారు.
గాజాపై దాడులు నిలిపివేసేలా ఇజ్రాయెల్పై ప్రపంచ నేతలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తాను గతంలో ప్లాన్ చేసుకున్నట్టు ఇజ్రాయెల్ సందర్శించకపోవడంతో తమ సదుద్దేశాలను ఇజ్రాయెల్ అవకాశంగా తీసుకుందని అన్నారు. మానవతాసాయం అందించేందుకు, ఖైదీల మార్పిడి కోసం రాఫా బోర్డర్ను ఓపెన్ చేయాలని ఎర్డోగాన్ ఇరు పక్షాలను కోరారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని నివారించడంలో ఐక్యరాజ్యసమితి వైఫల్యం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో 5791 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించగా, ఇక హమాస్ దాడుల్లో ఇజ్రాయల్లో 1400 మంది మరణించారు.
Read More :
Garba Event | గార్భా వేడుకలో విషాదం : కూతురిని వేధించిన యువకులను మందలించగా వారేం చేశారంటే..!