చండీఘడ్ : గార్భా వేడుకలో (Garba Event) విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్లోని ఓ నివాస సముదాయంలో గార్భా ఆడుతుండగా చెలరేగిన వివాదం ఈ ఘటనకు దారితీసింది. ఈ వేడుకల్లో తన కూతురును వేధించిన యువకులను ఓ వ్యక్తి (52) వారించగా వారు దాడిచేయడంతో అతడు మరణించాడు.
ఫరీదాబాద్లోని సెక్టార్ 86లోని ప్రిన్సెస్ పార్క్ సొసైటీలో జరిగిన గార్భా వేడుకల్లో వ్యక్తి కుటుంబం పాల్గొంది. ఇద్దరు యువకులు సదరు వ్యక్తి బాలికను ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగారు. దాండియా వేడుకలో వారు బాలిక చేతిని అసభ్యంగా తాకారు.
ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో బాలిక తండ్రి యువకులను నిలదీశాడు. ఆపై జరిగిన ఘర్షణలో వ్యక్తి కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read More :
Vote | మీ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి..