అంకారా: మనీల్యాండరింగ్కు పాల్పడిన నేరానికి ముగ్గురు అన్నదమ్ములకు తుర్కియేలోని ఓ కోర్టు ఏకంగా 11,196 సంవత్సరాలు చొప్పున జైలు శిక్ష విధించింది. వీరిలో క్రిప్టో బిజినెస్ వ్యవస్థాపకుడికి 40,562 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరడం మరో విచిత్రం. థోడెక్స్ అనే పేరుతో క్రిప్టో బిజినెస్ను స్థాపించిన ఫరూఖ్ ఫతిహ్ ఓజర్ (29) మనీలాండరింగ్కు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆయన మోసాలకు పాల్పడ్డారని, క్రిమినల్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నది. ఓజర్ దాదాపు 2 బిలియన్ డాలర్ల ఇన్వెస్టర్ అసెట్స్ను తీసుకుని పారిపోయారని, దాదాపు 30 మిలియన్ డాలర్లను రహస్య ఖాతాలకు తరలించారని ఆరోపించింది. వాదోపవాదాల తర్వాత ఓజర్తోపాటు ఆయన సోదరులు సెరప్, గువెన్ దోషులని కోర్టు నిర్ధారించింది. ఒక్కొక్కరికి 11,196 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది.