అంకారా: తుర్కియే భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 25 వేలు దాటింది. అయితే ప్రాణాలతో బయటపడ్డ ఘటనలు కూడా చాలా వేలుగులోకి వస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ 13 ఏళ్ల అబ్బాయిని రక్షించారు. అతని చేతుల్లో పెంపుడు చిలుక ఉంది. సుమారు 55 గంటల పాటు శిథిలాల కిందే ఆ చిన్నారి చిలుకను పట్టుకుని ఉన్నాడు. ఖరామన్మరాస్లో ఈ ఘటన జరిగింది.
ఓ కూలిన అపార్ట్మెంట్ వద్ద అరుపులు వినిపించాయి. దీంతో రెస్క్యూ టీమ్ అక్కడ మూడు గంటల పాటు సెర్చ్ చేసింది. ఆ తర్వాత బీరట్ సారి అనే కుర్రాడు రెస్క్యూ టీమ్కు చిక్కాడు. ఇక అతను తన చేతుల్లో ఓ చిలుకను సజీవంగా పట్టుకుని ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రెస్క్యూ టీమ్ అతన్ని గుర్తించన సమయంలో.. ఆ కుర్రాడు తన ఆంటీ కోసం వెతికిడు. ఆ చిలుకను ఆమెకు అప్పగించిన తర్వాత అంబులెన్స్ ఎక్కాడు. ఆ చిలుకకు ఆమె నీళ్లు, దాణా పెట్టింది. ప్రస్తుతం బీరట్కు చికిత్స అందిస్తున్నారు. చిన్నారి, చిలుక బ్రతికి ఉన్నారని తెలుసుకుని ఆ మహిళ ఆనందభాష్పాలు రాల్చింది.