న్యూయార్క్: కొవిడ్ వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే అది లీక్ అయిందనే ఆరోపణలున్నాయి. కాగా ఈ ల్యాబ్కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారట. ఈ విషయాన్ని శుక్రవారం యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ బయటపెట్టారు. 2020లో వుహాన్ ల్యాబ్కు ఆంథోనీ ఫౌచీ మిలియన్ల డాలర్ల అమెరికా ప్రజల పన్నులను ఫండ్ ఇచ్చారని గబార్డ్ వెల్లడించారు.
కొవిడ్ మూలాలను కనుక్కునేందుకు ఈ ఫండ్ ఇచ్చినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని.. వైరస్ వ్యాపించినప్పుడు చైనా అధికారులతో ఫౌచీ అనేకసార్లు మాట్లాడారని గబార్డ్ ఆరోపించారు. కొవిడ్ వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందనే విషయాన్ని దాచిపెట్టడానికి ఇంటెలిజెన్స్లోని అధికారులను రాజకీయంగా ప్రేరేపించారని, అప్పటి కాంగ్రెస్ను ఆంథోనీ తప్పుదోవ పట్టించారని ఆమె స్పష్టం చేశారు. ఫౌచీ ఈ నిధులు ఇవ్వడం వెనక పెద్ద ఫార్మా కంపెనీలకు సహకారం అందించే కుట్ర ఉందని గబార్డ్ ఆరోపించారు.