వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో రాజకీయ వేడి రాజుకుంటున్నది. సర్వే ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పది పాయింట్లు ముందంజలో ఉన్నట్టు వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ పోల్లో వెల్లడైంది. డెమొక్రాటిక్ పార్టీ నేత అయిన బైడెన్కు 42% మంది మద్దతు పలుకగా, రిపబ్లికన్ పార్టీ నేత అయిన ట్రంప్నకు 52 శాతం మంది మద్దతు లభించింది.
మే నెలలో నిర్వహించిన సర్వేలో ట్రంప్నకు 49 శాతం, బైడెన్కు 43 శాతం మద్దతు కనిపించింది. వలస సంక్షోభం, ప్రభుత్వంలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు, అభిశంసనకు పిలుపులు వంటివన్నీ బైడెన్కు ఇబ్బందికరంగా మారాయి. ఎన్బీసీ న్యూస్ పోల్లో పాల్గొన్నవారిలో 75% మంది తాము బైడెన్ (80) వయసు పట్ల ఆందోళన వ్యక్తంచేశారు.