చండీగఢ్: కోవిడ్ అనంతర సమస్యల కారణంగా భారత అథ్లెటిక్స్ దిగ్గజం, స్ప్రింటర్ మిల్కా సింగ్ శుక్రవారం మరణించారు. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న 91 ఏండ్ల మిల్కాసింగ్కు జ్వరంతో పాటు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో ఐసీయూకు తరలించారు.
నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్ గేమ్స్లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. 1956, 1964 ఒలింపిక్స్లో భారత్ తరఫున బరిలోకి దిగిన ఈ పంజాబీ వెటరన్కు 1959లో పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇటీవలే మిల్కాసింగ్ భార్య నిర్మల్కౌర్ (85) మొహాలీలో మరణించిన సంగతి తెలిసిందే.
మే 24 న “కోవిడ్ న్యుమోనియా” కారణంగా ఆయన మొహాలి ఫోర్టిస్ ఆసుపత్రిలోని ఐసియులో చేరాడు. అనంతరం జూన్ 3 న చండీగర్లోని పిజిఐఎంఆర్కు తరలించారు.కోవిడ్ అనంతర సమస్యల కారణంగా అతని భార్య నిర్మల్ మరణించిన ఐదు రోజుల తరువాత మిల్కా సింగ్ మరణించారు.
మిల్కా సింగ్ జూన్ 18 రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు అతని కుటుంబం ఒక ప్రకటనలో ప్రకటించింది.
మిల్కా సింగ్ మరణం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ ద్వారా నివాళులర్పించారు.
‘ఫ్లయింగ్ సిక్కు’ గా ప్రసిద్ది చెందిన మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పేరు తెచ్చుకున్నాడు, ఆసియా క్రీడలలో నాలుగు బంగారు పతకాలు సాధించాడు. కార్డిఫ్లో 1958 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించాడు, ఒలింపిక్ పతకాన్ని తృటిలో కోల్పోయాడు, 1960 రోమ్ గేమ్స్ 400 మీటర్ల ఫైనల్లో నాల్గవ స్థానంలో నిలిచాడు.
మిల్కా సింగ్ 45.73 సెకన్లలో రేసును ముగించాడు. 1998 లో పరంజీత్ సింగ్ దీనిని అధిగమించడానికి ముందు ఇది దాదాపు 40 సంవత్సరాలు జాతీయ రికార్డుగా ఉంది.