బీజింగ్: భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ తన కార్గో విమానాలను 15 రోజులు నిలిపివేసింది. చైనా, భారత్ మధ్య అతిపెద్ద కార్గో విమానాలు నడిపే సిచుయాన్ ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకున్నది.భారత్లో కరోనా పరిస్థితిలో ఆకస్మిక మార్పుల నేపథ్యంలో జియాన్- ఢిల్లీ, జియాన్-ముంబై, చెంగ్డు-చెన్నై, చాంగ్కింగ్-చెన్నై, చెంగ్డు-బెంగళూరు, చాంగ్కింగ్- ఢిల్లీ మధ్య మొత్తం ఆరు మార్గాల్లో పది కార్గో విమానాలను 15 రోజులపాటు నిలిపివేసినట్లు సోమవారం ప్రకటించింది.
మరోవైపు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కార్గో విమానాల నిలిపివేత వల్ల చైనా నుంచి ఆక్సిజన్, ఇతర వైద్య సామగ్రి దిగుమతిపై బాగా ప్రభావం చూపుతుందని భారత్లోని ప్రైవేట్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.