లక్నో, నవంబర్ 30: రోడ్డు మీదికి బండెక్కిందంటే చాలు.. కావాల్సినంత వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం! రణగొణ ధ్వనులతో చెవులు మోతెక్కిపోతాయి. నల్లని పొగతో ముక్కు నిండిపోతుంది. ఈ మధ్య విద్యుత్తు వాహనాలు వచ్చినా, ఇప్పటి పరిస్థితుల్లో అవి ఏ కోశానా సరిపోవు.
ఈ సమస్యంతా ఎందుకు? వాహనం నడుస్తుండగానే గాలిని శుభ్రం చేసే టెక్నాలజీ అభివృద్ధి చేస్తే సరిపోద్ది కదా! ఈ ఆలోచన తట్టిన వెంటనే తమ బుర్రకు పదునుపెట్టి అద్భుతం చేసి చూపించారు లక్నో బాలలు. కారు నడిపితే వాతావరణంలోని గాలిని శుభ్రం చేసే సాంకేతికతను రూపొందించారు. అదే.. డస్ట్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ (డీఎఫ్ఎస్). లక్నోకు చెందిన ‘ఫోర్ ఎవర్’.. విరాజ్ మెహ్రోత్రా (11), ఆర్యవ్ మెహ్రోత్రా (9), గర్విత్ సింగ్ (12), శ్రేయాన్ష్ మెహ్రోత్రా (14) కలిసి ఈ గొప్ప ఘనతను సాధించారు. వీరికి లక్నోకే చెందిన రొబోటిక్ నిపుణుడు మిలింద్ రాజ్ సహాయం అందించారు. వీరంతా కలిసి వన్ సీటర్, టూ సీటర్, త్రీ సీటర్ కార్లను తయారు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ కార్లలో ప్రయాణిస్తుండగానే వాతావరణంలోని ధూళిని పీల్చి గాలిని స్వచ్ఛంగా మార్చేస్తాయి.
కార్ల విశేషాలు: