వాషింగ్టన్ : అమెరికా తన విధ్వంసక ‘జేఏఎస్ఎస్ఎం-ఈఆర్’ క్షిపణులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థావరాల నుంచి ఇరాన్ వైపు తరలిస్తున్నది. యుద్ధం మొదలు గాక ముందు క్షిపణి నిల్వలు 2,300 ఉండగా, దీంట్లో 1,000 క్షిపణుల్ని యుద్ధంలో మొదటి నాలుగు వారాల్లోనే అమెరికా వాడేసింది. మిగిలిన యూనిట్లను కూడా గల్ఫ్లోని సైనిక స్థావరాలకు అమెరికా తరలిస్తున్నది.
శత్రుదేశం గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకుంటూ 600 మైళ్లకుపైగా (సుమారుగా 965 కిలోమీటర్లు) దూరంలోని లక్ష్యాలను ఛేదించటం దీని ప్రత్యేకత. యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ, అమెరికాకు వీటి అవసరం పెరుగుతున్నది. ఈ క్షిపణుల మొత్తం నిల్వలన్నీ ఇరాన్పై వాడేందుకు అమెరికా యోచిస్తున్నదని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది.