లండన్: వచ్చే 30 ఏండ్లలో డయాబెటిస్ మరింతగా విజృంభించనున్నదని, ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు పేర్కొన్నారు.
2050 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య దాదాపు 130 కోట్లకు చేరుకొంటుందని, ఇందులో టైప్-2 డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉంటాయని లాన్సెట్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు.