శాన్ఫ్రాన్సిస్కో, ఏప్రిల్ 7: మూడు రోజుల క్రితం అనూహ్యంగా ట్విట్టర్ లోగో మారిపోయింది. పిట్ట స్థానంలో జపాన్కు చెందిన షిబా ఇను అనే రకమైన కుక్క బొమ్మను ట్విట్టర్ లోగోగా పెట్టారు. ఎవరో యూజర్ అడిగారని లోగో మార్చినట్టు ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
ఇప్పుడు దానిని తొలగించి మళ్లీ పాత లోగోనే పెట్టారు. అయితే, లోగో ఎందుకు మార్చారనే అసలైన కారణాన్ని మాత్రం మస్క్ బయటపెట్టలేదు. మస్క్ ట్విట్టర్ లోగోగా పెట్టిన కుక్క బొమ్మ మీద డోజీకాయిన్ అనే క్రిప్టోకరెన్సీ ఉంది. మస్క్ చేసిన పనికి ఈ క్రిప్టో కరెన్సీ విలువ ఒక్కసారిగా 30 శాతం పెరిగిపోవడం గమనార్హం.