న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికాతో శాంతి చర్చల కోసం పాకిస్థాన్కు పయనమైన ఇరాన్ ప్రతినిధి బృందం మినాబ్-168 అని పేరు పెట్టిన విమానంలో ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైన మొదటి రోజైన ఫిబ్రవరి 28న ఇరాన్లోని మినాబ్ నగరంలోగల హాజారే తయ్యేబే ప్రాథమిక పాఠశాలపై క్షిపణి దాడి జరిగినపుడు 168 మంది మరణించారు.
వారిలో చాలామంది బాలికలు ఉన్నారు. ఆ బాలికలకు నివాళిగా విమానానికి ఆ పేరు ఇరాన్ ప్రభుత్వం పెట్టింది. ప్రతినిధి బృందం సభ్యులతోపాటు మరణించిన బాలికల ఫొటోలు, రక్తపు మరకలున్న స్కూల్ బ్యాగులు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఆనాటి హృదయవిదారక ఘటనను గుర్తుచేస్తూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ ఎక్స్లో పోస్టు పెట్టారు.