Ecuador | ఈక్వెడార్, జూన్ 14: మరణించిన వృద్ధురాలిని శవపేటికలో శ్మశానవాటికకు తరలిస్తుండగా లేచిన సంఘటన దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలో చోటుచేసుకుంది. బంధువులను షాక్నకు గురి చేసిన ఈ ఘటన ఈక్వెడార్లోని బాబహోయా నగరం జరిగింది.
శ్మశానానికి తరలిస్తుండగా.. చేతితో శవపేటికను తట్టిన శబ్దం వినిపించిందని ఆమె కుమారుడు గిల్బెర్టో బార్బెరా తెలిపారు. దీంతో వెంటనే శవపేటిక తెరిచి చూడగా, ఆమె బతికే ఉన్నట్టు తెలిసింది.