బ్యాంకాక్ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా 5 నుంచి 11 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు వేసేందుకు థాయ్లాండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఫైజర్ బయోఎన్టెక్ కంపెనీ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు పేర్కొంది. 10 మైక్రోగ్రాముల చొప్పున 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వనున్నట్లు థైపీ డ్రగ్ రెగ్యులేటరి ఒక ప్రకటనలో వివరించింది.