న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: హౌతీలు, సౌదీ అరేబియా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. హౌతీ తిరుగుబాటుదారులు సోమవారం సౌదీ అరేబియాకు చెందిన అభా, జిజాన్, నజ్రన్, ఖమీస్ ముషాయిత్ నగరాలపై దాడులు జరపడంతో మహిళలు, పిల్లలతో సహా 73 మంది గాయపడ్డారు. అభా విమానాశ్రయం, కింగ్ ఖాలీద్ ఎయిర్ బేస్, కొన్ని అరాంకో సదుపాయాలపై కూడా దాడులు జరిగినట్టు సమాచారం. అంతకు కొన్ని గంటల ముందు అల్ హజ్మ్ నగరంలోని ఒక జైలుపై సౌదీ అరేబియా దాడి చేసిందని హౌతీలు ఆరోపించారు.
ఈ దాడిలో 11 మంది మరణించారు. వారిలో తన తల్లితో కలిసి తండ్రిని చూడటానికి వచ్చిన ఒక బాలుడు కూడా ఉన్నాడు. శిథిలాల కింద ఒక మహిళతో సహా 35 మంది ఖైదీలు చిక్కుకున్నట్టు జైలు వార్డెన్ తెలిపారు.