క్వెట్టా: పాకిస్థాన్లోని క్వెట్టాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 20 మంది వరకూ గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీకె తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) వెల్లడించింది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు 25 కిలోమీటర్లు దక్షిణంగా.. క్వెట్టా-మాస్తంగ్ రోడ్డులోని చెక్పాయింట్ దగ్గర ఈ దాడి జరిగింది. చెక్పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులపైకి ఓ వ్యక్తి బైక్పై దూసుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నాడని, ఈ పేలుడులో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. టీటీపీ దాడిని ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చెప్పారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కూడా ఈ దాడిని ఖండించారు.