ఆఫ్గన్లోని తాలిబాన్ సర్కార్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరని పని తేల్చేసింది. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం ఆపేసింది. కాబుల్తో పాటు మరికొన్ని ప్రావిన్సెస్లో ఇలాంటి వాతావరణమే వుందని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. దేశంలో ఆహార కొరతతో పాటు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మానవ హక్కులు కూడా పూర్తిగా హరించబడిన సమయంలో ఈ నిర్ణయం వెలువడింది.
తాలిబాన్లు అధికారంలోకి రాక మునుపు కొన్ని ప్రధాన పట్టణాల్లో మాత్రమే మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేసేవారు. కాబూల్లో కూడా చేసేవారు. ఇక.. తాలిబాన్లు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని నిలిపేశారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ హక్కులు పూర్తిగా మాయమయ్యాయని స్థానిక మీడియా పేర్కొంటోంది. ముఖ్యంగా మహిళల విషయంలో మానవ హక్కులు పూర్తిగా నాశనమయ్యాయని మీడియా పేర్కొంటోంది.