కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ( Bomb Attacks ) లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్కువ సంఖ్యలో తమవారిని కోల్పోయినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే ఎయిర్పోర్ట్పై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆగస్టు 31వ డెడ్లైన్ను పొడించాల్సిన అవసరం లేదని కూడా ఓ తాలిబన్ అధికారి తెలిపారు. కాబూల్లో జరిగిన పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 90కి చేరుకున్నది. దాంట్లో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్ర సంస్థ ప్రకటించింది. పేలుళ్ల వల్ల సుమారు 150 మంది గాయపడ్డినట్లు తెలుస్తోంది.
ఎయిర్పోర్ట్ వద్ద దాడుల తర్వాత.. చాలా వరకు దేశాలు పౌరుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు లక్ష మందిని తరలించినట్లు అమెరికా చెప్పింది. గత 12 గంటల్లో ఏడు వేల మందిని తరలించినట్లు బైడెన్ తెలిపారు.