కాబూల్ : ఆప్ఘనిస్థాన్లో తాలిబన్లు ( Taliban ) రెచ్చిపోతున్నారు. రక్తపుటేరులు పారిస్తున్నారు. ఆప్ఘన్లోని కీలక ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సాధారణ పౌరులపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. ఓ మహిళ బిగుతైన దుస్తులు ధరించిందని.. ఆమెను తాలిబన్లు అత్యంత దారుణంగా చంపేశారు. మహిళలు పని కోసం బయటకు వెళ్లకూడదని తాలిబన్లు నిషేధం విధించారు. ఈ క్రమంలో ఆ మహిళ పని నిమిత్తం బుర్ఖా ధరించి వాహనం ఎక్కబోతుండగా తాలిబన్లు దాడి చేసి చంపారు. మృతురాలని 21 ఏండ్ల నజానిన్గా పోలీసులు గుర్తించారు. అయితే ఆమెను తాము చంపలేదని తాలిబన్లు ప్రకటించారు. పోలీసులు తమపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.