కాబూల్ : తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ఘాన్ రాజధాని కాబూల్ జిల్లాలోని ఓ స్కూల్లో గురువారం జరిగిన పేలుడులో తాలిబన్ మత గురువు షేక్ రహిముల్లా హక్కానీ మరణించారు. ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరిమి హుక్కానీ మృతిని ధ్రువీకరించారు. స్కూల్లో జరిగిన పేలుడులో మత ప్రబోధకుడు షేక్ రహిముల్లా హక్కానీ మరణించాడు.
ఆయన మృతిని ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరిమి ధ్రువీకరించారని టోలో న్యూస్ ట్వీట్ చేసింది. ఇటీవల కాలును కోల్పోయిన ఓ వ్యక్తి ప్లాస్టిక్ కృత్రిమ కాలులో పేలుడు పదార్ధాలను అమర్చి కాబూల్ స్కూల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వార్తా సంస్ధ పేర్కొంది. కాగా, ఈ దాడి వెనుక ఎవరున్నారనేది ఇంకా వెల్లడి కాలేదు.