బీజింగ్: డయాబెటిక్స్తో బాధపడుతున్నవారు భిన్నమైన ఆహారం తీసుకోవటం ద్వారా రక్తంలో చెక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చని తాజా పరిశోధనలో తేలింది. ఉదయం ఆలు, మధ్యాహ్నం తృణధాన్యాలు, రాత్రి ఆకుపచ్చ కూరలు, కాయలు, పాలు, ప్రాసెస్డ్ మాంసం తీసుకొంటూ నిద్ర సమయ పాలన పాటిస్తే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని చైనాలోని హర్బిన్ మెడికల్ యూనివర్సిటీ ఎండీ క్వింగ్రావ్ సోంగ్ తెలిపారు. ఈ నియమాలు పాటిస్తే డయాబెటిక్ ఉన్నవారు కూడా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలరని పేర్కొన్నారు. డయాబెటిక్ రోగులకు ఆహారం తీసుకోవటంలో సమయపాలన పాటించటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.