జకర్తా: ఇండోనేషియాలోని బాలి తీర ప్రాంతంలో ఆ దేశ సబ్మెరైన మిస్సైన ఘటన తెలిసిందే. కేఆర్ఐ నంగ్గాలా 402 టార్పిడో డ్రిల్ చేస్తున్న సమయంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 53 మంది జలాంతర్జామి సిబ్బంది ఆచూకీ లేకుండాపోయారు. అదృశ్యమైన సబ్మెరైన్ కోసం గాలింపు చేపట్టారు. ఆస్ట్రేలియా, సింగపూర్ సాయం కోరింది ఆ దేశం. అయితే ఇండోనేషియా సబ్మెరైన్ను వెతికేందుకు భారత నౌకాదళం డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెసల్ను పంపింది. విశాఖపట్టణం నుంచి అది బయలుదేరి వెళ్లింది. ఇండోనేషియా నేవీకి డీఎస్ఆర్వీ సహకరించనున్నది. సబ్మెరైన్ నంగ్గాలా కోసం భారతీయ నౌక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నది.