చైనాలోని మంగోలియా రీజియన్లో వింత ఘటన చోటుచేసుకున్నది. ఓ గొర్రెల మంద 12 రోజులుగా వృత్తాకార మార్గంలో తిరుగుతూనే ఉన్నది. సందర్భానుసారం కొన్ని గొర్రెలు మధ్యలోకి వచ్చి నిల్చుంటుండగా, మరికొన్ని బయటనుంచి చూస్తూ ఉన్నాయి. ఈ వీడియోను చైనాకు చెందిన పీపుల్స్ డైలీ ట్వీట్ చేయగా, వైరల్గా మారింది. గొర్రెలన్నీ ఆరోగ్యంగానే ఉన్నా.. ఇలా వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో అంతుచిక్కడం లేదు. కాగా, ‘లిస్టిరియోసిస్’ అనే సర్కిల్ డిసీజ్ ఇందుకు కారణమని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.