టెహ్రాన్: వెంటనే ఇరాన్ను వీడాలని ఆ దేశంలోని భారతీయులకు టెహ్రాన్లోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే బుధవారం ఎంబసీ ఈ సూచన చేసింది. తాము సూచించిన మార్గాల గుండా ఇరాన్ను వీడాలని చెప్పింది.
‘మా ఆఫీస్తో ముందస్తు సంప్రదింపులు, సమన్వయం లేకుండా ఏ అంతర్జాతీయ భూ సరిహద్దును చేరుకోవడానికి ప్రయత్నించొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నది. అత్యవసర సాయం కోసం +989128109115; +989128109109; +989128109102; +989932179359 ఫోన్ నంబర్లలో లేదా cons.tehran@mea.gov.in మెయిల్ ఐడీలో తమను సంప్రదిం చాలని కోరింది.