కొలంబో, జూలై 23: శ్రీలంకలో మొదలైన ప్రజా ఉద్యమంలో ఓ పండు ముదుసలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉద్యమం ప్రారంభమైన ఏప్రిల్ నుంచీ ఇప్పటి వరకు ప్రతిరోజూ కొలంబోలో జరిగే నిరసనల్లో ఆమె పాల్గొంటున్నారు. ఆమె పేరే జీన్ ప్రిమ్రోస్ నథానీల్జ్. ఆందోళనకారులు ఆమెను ‘ఆంటీ జీన్’ అని పిలుస్తున్నారు.
వత్తల ప్రాంతం నుంచి ప్రతిరోజూ రైలెక్కి కొలంబోకు వచ్చే ఆమె.. నిరసన పూర్తి కాగానే మళ్లీ ఇంటికి తిరుగుప్రయాణం అవుతున్నారు. కాగా, లంక అధ్యక్షుడు, ప్రధాని అధికార నివాసాలను ఆక్రమించిన నిరసనకారులు 1000కిపైగా విలువైన కళాఖండాలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు చెప్పారు.