Sri Lanka Crisis | పొరుగుదేశం శ్రీలంక ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే అల్లాడుతున్నది. సంక్షోభం నుంచి గట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది సైన్యంలో 16వేల పోస్టులను తొలగించేందుకు నిర్ణయించింది. వ్యవయాన్ని తగ్గించుకోవాలన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) షరతు తలొగ్గింది. దేశ భద్రతపై ఉన్న ఆందోళనను పక్కనబెట్టి చివరకు రణిల్ విక్రమ సింఘే సైన్యంపై ఉక్కుపాదం మోపింది. సైనికులు స్వచ్ఛందంగా పదవీ విరమణ కోసం కృషి చేయాలని, తద్వారా రక్షణ వ్యవయాన్ని తగ్గించవచ్చని విక్రమ సింఘే ఇటీవల ప్రతిపాదించగా.. ఈ పథకం ప్రారంభమైంది.
సైనికులు స్వచ్ఛంద పదవీ విరమణ పొందేందుకు వీలుగా సైన్యం నిబంధనల్లో పలు మార్పులు చేసింది. శ్రీలంక ఆర్మీలో సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేయడం చట్టవిరుద్ధం. ఈ క్రమంలో అలాంటి గైర్హాజరీకి చట్టపరమైన గుర్తింపు ఇచ్చేందుకు సాధారణ క్షమాభిక్ష ప్రకటించారు. ఇందులోభాగంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోవాలనుకునే వారిని హాజరుకాని వారిని పరిగణించి సర్వీసు నుంచి విడుదల చేస్తారు.
స్వచ్ఛంద పదవీ విరమణకు 16వేలమందికిపైగా దరఖాస్తు
సైన్యంలో గైర్హాజరైన సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ సాధారణ క్షమాభిక్ష ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ కారణంతోనైనా విధులకు గైర్హాజరైన సైనికులను సర్వీస్ నుంచి రిలీవ్ చేయనున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సైనిక సిబ్బందికి సైతం ఈ వెసులుబాటును కల్పించారు. క్షమాభిక్ష పథకం కోసం ఇప్పటివరకు 16,141 మంది సైనికులు దరఖాస్తు చేసుకున్నారని ఆర్మీ అధికార ప్రతినిధి రవి హెరాత్ తెలిపారు. 21 మంది అధికారులు, 15,838 మంది ఇతర ర్యాంక్ సిబ్బంది మెడికల్ అండ్ సెక్యూరిటీ క్లియరెన్స్తో రాజీనామాలను పంపారని పేర్కొన్నారు. మరో 179 మంది సిబ్బందికి సెక్యూరిటీ, మెడికల్ క్లియరెన్స్ జారీ చేస్తున్నారన్నారు.
ఇదిలా ఉండగా.. గత వారం తుఫాను సమయంలో వీచిన చలిగాలుల కారణంగా జంతువులు అస్వస్థతకు గురవగా.. వాటికి సరైన అందడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో జంతువులు ప్రాణాలు వదులుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దేశంలో మందులు, ఇంధనం కొరత కారణంగా సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. సరైన వైద్యం అందక డిసెంబర్ 14 వరకు 1,272 జంతువులు మరణించాయి.
ప్రస్తుతం 400కు పైగా జంతువులకు చికిత్స అందిస్తున్నారు. ఉత్తర ప్రావిన్స్కు చెందిన జంతు ఆరోగ్య విభాగం డైరెక్టర్ ఎస్ వశిహరన్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ మందులు ధరలు ఖరీదయ్యాయని, వాటి స్టాక్ సైత తక్కువగా ఉందని తెలిపారు. జంతువుల యజమానులు కొందరు మందులు కొనుగోలు చేసి తీసుకువస్తున్నాన్నారు. మందులు లేకపోవడంతో చాలా జంతువులను రక్షించలేకపోయామని.. అందుబాటులో ఉన్న వాటితో 250 జీవాల ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా శ్రీలంక అంతటా చల్లని గాలులు వీచాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.