శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని మహీంద్ర రాజపక్సే కీలక ప్రకటన చేశారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికారాలు తగ్గిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రపతి అధికారాలను తగ్గించి, పార్లమెంట్ అధికారాలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరిస్తామని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరత కోసం, ఐఎంఎఫ్ ఫండ్ కోసం.. పై నిర్ణయాలు ఎంతో ఉపయోగపడతాయని, అత్యంత తొందరగా ఈ పనులు పూర్తి కావడానికి సహకరిస్తాయని వివరించారు. దేశం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే, దేశంలో సుస్థిరత కావాలంటే పార్లమెంట్కు మరిన్ని అధికారాలు కావాలని ఆయన స్పష్టం చేశారు.
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో కొత్త క్యాబినెట్ను ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులుగా ఉన్న చమల్ రాజపక్స, మహింద కుమారుడు నమల్ రాజపక్స పాటు సహాయ మంత్రిగా వ్యవహరించిన మేనల్లుడు శశీంద్రకు తాజా క్యాబినెట్లో చోటు కల్పించలేదు.