Mahinda Rajapaksa | పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయలేదని ఆయన కార్యాలయం ఆదివారం రాత్రి పేర్కొంది. మహింద రాజపక్స రాజీనామా వార్తలను కొట్టి పారేసింది.
ప్రస్తుతం ఆయనకు అటువంటి ప్రణాళికలే లేవని శ్రీలంక పీఎంవో తేల్చేసింది. మహింద రాజపక్స రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పని పీఎంవో తెలిపింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు నిండుకోవడంతో ఆహారం మొదలు ఇంధనం ఇతర నిత్యావసరాలకు భారీ కొరత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెరాడెన్యా బయట విద్యార్థులు నిరసనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించారు.