కొలంబో : శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సతో సమావేశమైన రాజీనామా లేఖను సమర్పించారని, అయితే, రాజీనామాను ఇంకా ఆమోదించలేదని వార్తలు వచ్చాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రధాని, అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. అయితే, మహింద రాజపక్స రాజీనామా వార్తలపై ప్రధాని కార్యాలయం స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలనీ, ప్రధాని అలాంటి ఆలోచనలో లేరని క్లారిటీ ఇచ్చింది.
అప్పుల ఊభిలో కూరుకుపోయింది. కొద్ది కాలం కిందటనే సమస్యలు ప్రారంభమైనా.. ఈ ఏడాది నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 18.5శాతానికి పెరిగింది. ఆహార ఉత్పత్తుల విషయంలో ద్రవ్యోల్బణం 25శాతానికి పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల తీవ్ర భారం పడింది. బియ్యం, పప్పులు, గోధుమలు, ఇలా అన్ని రకాల ధాన్యాలు సామాన్యులకు కొనుగోలు చేయలేని స్థితికి చేరాయి. ప్రస్తుతం శ్రీలంక రాజధాని కొలంబోలో బియ్యం కిలో ధర రూ.200 దాటింది. కిలో గోధుమలు కొనుగోలు చేసేందుకు రూ.190 చెల్లించాల్సి వస్తున్నది.
కిలో చక్కెర ధర రూ.240కి చేరింది. లీటర్ కొబ్బరి నూనె ధర రూ.750, ఒక్క కోడిగుడ్డుకు కొనాలంటే రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. అలాగే పిల్లలకు సంబంధించిన పాలపొడి సైతం కిలో రూ.1900కు చేరింది. ఇక కూరగాయలు కొనలేని పరిస్థితి. ఈ క్రమంలో ప్రధాని మహింద రాజపక్స, గోటబయ రాజపక్సపై దేశ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపిస్తున్నారు. అయితే, ఇందులో వాస్తవం లేదని లంక నిపుణులు పేర్కొంటున్నారు. లోటు బడ్జెట్ను పూడ్చలేమని, రాజపక్స ప్రభుత్వ పన్ను విధానం మోకాలడ్డిన విషంలా మారిందన్నారు.
రాజపక్స 2019లో ఎన్నికల వాగ్ధానంలో భారీ పన్ను తగ్గింపులు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అమలులోకి తెచ్చారన్నారు. అయితే ఆ తర్వాత కొవిడ్ విజృంభించిన తర్వాత పరిస్థితి చేయిదాటిపోయిందని పేర్కొంటున్నారు. శ్రీలంక ప్రభుత్వం పర్యాటక నుంచి భారీ లాభాలను ఆర్జించింది. కరోనా సమయంలో అక్కడ పని చేస్తున్న విదేశీయుల జీతాల్లోనూ కోత విధించారు. దీంతో పర్యాటక రంగంలో శ్రీలంక పత్రిష్ట మసకబారింది. పర్యాటకరంగంపై ప్రభావం చూపింది. అదే సమయంలో చైనా నుంచి తీసుకున్న భారీ రుణం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నుముక విరిగినట్లయ్యింది.
ఎందుకంటే గత రెండేళ్లలో పేరుకుపోయిన విదేశీ మారకద్రవ్య నిల్వలు 60శాతానికి పడిపోయాయి. అదనంగా రాజపక్స 2021లో వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధించారు. తర్వాత నిషేధం ఎత్తివేసినా అప్పటికే వ్యవసాయం విపరీతంగా నష్టపోయింది. 2010లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గోటబయ.. మహిందను ప్రధానిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దేశ పార్లమెంట్లో మెజారిటీ ఉన్నప్పటికీ రణిల్ విక్రమసింఘే దూరమయ్యారు. అంతకుముందు, అక్టోబర్ 26, 2016న అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు.
మహింద తర్వాత ఆయన సన్నిహితుడు సిరిసేన అధికారంలోకి వచ్చారు. మహిందను ప్రధానిగా కొనసాగించలేకపోయారు. శ్రీలంక రాజకీయాల్లో సుదీర్ఘ ప్రతిష్టంభన, రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నది. ఆ సమయంలో, దేశ అత్యున్నత న్యాయస్థానం మహింద అధికారంలో ఉండడం చట్టవిరుద్ధమని ప్రకటించింది.