Human Rights | అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా శ్రీలంకలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆర్థిక సంస్కరణపై ప్రశ్నలు సంధించింది. శ్రీలంకలోని సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక హక్కులను మరింతగా క్షీణింపజేసేలా ఉన్న విధానాలపై సంస్థ అధికారులతో చర్చలు జరుపుతామని, తమ ఆందోళనలను ఇంతకు ముంద ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ల్ పేర్కొంది. తాజాగా హ్యూమన్ రైట్స్ వాచ్ ఒక నోట్ను విడుదల చేసింది. అవినీతి నిరోధక చర్యలను అమలు చేస్తున్న శ్రీలంక ప్రభుత్వంపై ఐపీఎఫ్ భవిష్యత్తులో రుణాల కోసం షరతు విధించే అవకాశం ఉందని పేర్కొంది.
అలాంటప్పుడు, అవినీతి నిరోధక సంస్కరణలు పరిపాలనలో జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి శ్రీలంక ప్రభుత్వం హామీ ఇవ్వాలి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ అవినీతి, పన్ను నిబంధనలు సంపన్నులకు ప్రయోజనం చేకూర్చాయని, ఇది శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమని, దీని కారణంగా శ్రీలంక ప్రజలు తమ అవసరాలను తీర్చుకునేందుకు ఇబ్బందులుపడాల్సి ఉందని పేర్కొంది. మళ్లీ అదే ప్రజలపై మరింత భారాన్ని మోపకూడదని అభిప్రాయపడింది. అది యుద్ధ నేరాలైనా, దుష్పరిపాలన అయినా, అణచివేత అయినా.. ఈ కేసులన్నింటిలో ప్రభుత్వం జవాబుదారీతనాన్ని నిర్ణయించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం దశాబ్దాల బాధ్యతారహిత ద్రవ్య విధానం, రాయితీల దుర్వినియోగం, ఫలితంగా ప్రస్తుత ఏర్పడిందని నిపుణుల మధ్య సాధారణ ఏకాభిప్రాయంగా ఉందని తెలిపింది.
లంక ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య ఐఎంఎఫ్ రుణం జీవనాడి లాంటిదని హ్యూమన్ రైట్స్ వాచ్ అంగీకరించింది. అయితే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం సంక్షోభంలో ఉన్న దేశానికి సహాయం చేయడం ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల బాధ్యత అని పేర్కొంది. మానవ హక్కులకు ముప్పు వాటిల్లని విధంగా ఈ సహాయం అందించాలని సూచించింది. తక్కువ ఆదాయ సమూహాల ద్వారా అవసరమైన వస్తువులు, సేవలను మరింత పరిమితం చేసే విధానాలను అనుసరించడం మానుకోవాలని సూచించింది.