కొలంబో, అక్టోబర్ 24: ఇక నుంచి భారత్, మరో ఆరు దేశాల వారు వీసాలకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండా శ్రీలంక టూరిస్టు వీసాలను ఉచితంగా పొందవచ్చు. భారత్ సహా చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్కు చెందిన టూరిస్టులకు ఉచితంగా వీసాను మంజూరు చేస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి అలీప సాబ్రీ మంగళవారం తెలిపారు.
తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని, దీన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. రుణ ఊబిలో చిక్కుకున్న శ్రీలంకలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.