ముంబై: ఒత్తిళ్లకు తలొగ్గకుండా మీడియా స్వతంత్రంగా, నిర్భయంగా వాస్తవాలు చెప్పాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అయితే కొన్ని మీడియాలు ఊహాజనిత, అసత్య వార్తలు వెలువరిస్తున్నాయని, ఇది ‘డేంజరస్ కాక్టెయిల్’వంటిదన్నారు. ముంబై ప్రెస్క్లబ్ బుధవారం నిర్వహించిన ‘రెడ్ ఇంక్స్ అవార్డ్’ కార్యక్రమంలో వర్చువల్గా మాట్లాడారు. అఫ్గానిస్థాన్లో తాలిబన్ల అరాచకాలను కెమెరాలో బంధిస్తూ ప్రాణాలు కోల్పోయిన రాయిటర్స్ చీఫ్ ఫొటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖీని ‘జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్-2020’అవార్డు వరించింది. సీనియర్ జర్నలిస్టు ప్రేమ్ శంకర్ ఝాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు.