కాబూల్, ఫిబ్రవరి 19: అఫ్ఘానిస్థాన్లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తూ ఎప్పటికప్పుడు అమానవీయ నిబంధనలను తీసుకువస్తున్నారు. తాజాగా మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ అరాచక చట్టాన్ని తెచ్చారు. ఎముకలు విరగకపోతే నేరం కాదంటూ గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు.
రక్తస్రావం కానంతవరకు ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హం కాదని తెలిపారు. ఈ మేరకు కొత్త నిబంధనలపై అఫ్ఘాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశారు. ఒకవేళ భర్త క్రూరంగా ప్రవర్తించటం వల్ల ఎముకలు విరిగినట్టు బయటకు కనిపిస్తే, గాయాలు అయితే కేవలం 15 రోజులు మాత్రమే జైలు శిక్ష విధిస్తారు.